మహిళా బిల్లును అడ్డుకోవడం భ్రూణహత్యే
NEWS Apr 18,2026 10:24 pm
మహిళా రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నారీ శక్తి వందన్’ సవరణను అడ్డుకోవడం భ్రూణహత్యతో సమానమని, కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎస్పీలే ఈ పరిణామానికి ప్రధాన బాధ్యులని విమర్శించారు. మహిళల రాజకీయ సాధికారత కోసం తీసుకొచ్చిన చట్టాన్ని విపక్షాలు అడ్డుకున్నాయని, వచ్చే ఎన్నికల్లో మహిళలే వారికి తగిన బుద్ది చెబుతారని అన్నారు.