ప్రైవేట్ స్కూల్ బస్సుల అడ్డంకి దారుణం
NEWS Apr 18,2026 10:27 pm
కథలాపూర్ మండలంలోని మాస్ట్రో కిడ్డీజ్ పాఠశాల వద్ద ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు సమావేశం నిర్వహించాయి. రాష్ట్ర ప్రైవేట్ టీచర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రైవేట్ స్కూల్ బస్సులు రావద్దని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఖండనీయమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపడం లేదని ప్రశ్నించారు. నాణ్యమైన విద్య ఉన్న చోటుకే విద్యార్థులు వెళతారని చెప్పారు. ప్రైవేట్ స్కూల్లకు పంపితే రేషన్ కార్డులు తొలగిస్తామని బెదిరించడం దురదృష్టకరమన్నారు.