మళ్లీ పెరిగిన పసిడి, వెండి ధరలు
NEWS Apr 18,2026 02:30 pm
అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. 3 రోజుల ర్యాలీ తరువాత నిన్న కాస్త తగ్గిన ధరలు నేడు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర రూ.810 మేర పెరిగి రూ.1,55,780కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.750 మేర పెరిగి రూ.1,42,800కు చేరుకుంది. వెండి ధరలో కూడా రూ.5 వేల మేర పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం నగరంలో కిలో వెండి ధర రూ.2.8 లక్షలుగా ఉంది.