వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లు
NEWS Apr 17,2026 09:11 pm
లోక్సభలో మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు మెజారిటీ సాధించలేక వీగిపోయింది. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు పడినప్పటికీ అవసరమైన మూడింట రెండొంతుల మద్దతు రాలేదు. ఈ బిల్లు ద్వారా లోక్సభ స్థానాలను 543 నుంచి 850కు పెంచడం, 2029 నుంచి మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయడం లక్ష్యం. ఉత్తర రాష్ట్రాలకు రాజకీయ లాభం చేకూరుతుందని దక్షిణాది రాష్ట్రాల ఆందోళనల మధ్య ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి.