మేడిపల్లి మండలంలోని కట్లకుంట గ్రామానికి చెందిన మారంపెల్లి హృతిక్, బొల్లారపు అంశుత్లు రుక్మాపూర్ సైనిక్ స్కూల్లో 6వ తరగతికి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ స్థాయి విజయాన్ని సాధించడం గ్రామానికి గర్వకారణమని మాజీ ఉపసర్పంచ్ నూతిపెల్లి శంకర్ పేర్కొన్నారు. విద్యార్థులకు మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, విద్యా కమిటీ సభ్యులు విద్యార్థులను అభినందించి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.