లోక్సభలో 3 బిల్లులపై రేపు ఓటింగ్
NEWS Apr 16,2026 01:42 pm
ఉద్రిక్తతల మధ్య లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చర్చ ప్రారంభించారు. డీలిమిటేషన్ బిల్లుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల పునర్విభజన బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రవేశపెట్టారు. రాజ్యాంగ సవరణలకు విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ నినాదాలు చేశాయి. బిల్లులపై 12 గంటల పాటు చర్చ కొనసాగుతుందని అమిత్ షా తెలిపారు. అవసరమైతే సమయం పెంచవచ్చని స్పష్టం చేశారు. 3 బిల్లులపై రేపు సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరుగుతుందని స్పీకరు ఓం బిర్లా తెలిపారు.