దశదినకర్మ కార్యక్రమంలో శ్రీరామమూర్తి
NEWS Apr 15,2026 10:47 pm
పాల్వంచ మండలం నాగారం గ్రామానికి చెందిన ఇటీవల మరణించిన కాటరపు సుశీలమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లెల శ్రీరామమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుశీలమ్మ చిత్రపటానికి నివాళులర్పించి, ఆమె కుమారుడు కాటరపు ఆదినారాయణతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కష్టసమయంలో పార్టీ తరఫున అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. ప్రభాకర్ రెడ్డి, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.