అభివృద్ధి పనులు చేపట్టాలి: కార్పొరేటర్
NEWS Apr 15,2026 05:58 pm
గత ఏడాదికి సంబంధించిన మున్సిపాలిటీ పన్ను రూ.36,54,146 విలువైన చెక్కును 4వ డివిజన్ కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి, సివిల్ సహాయ విభాగ అధికారి బి. శ్రీను ద్వారా కమిషనర్ సుజాతకు అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కాలనీ నుంచి పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ పారిశుద్ధ్య పనులు చేపట్టడం లేదని అన్నారు. ఇకపై శుభ్రత చర్యలు, పార్కుల నిర్వహణ, మొక్కల పెంపకం కార్యక్రమాలు చేపట్టడంతో పాటు కాలనీలో ఓపెన్ వ్యాయామ వేదిక ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.