భద్రాచలం దేవస్థానం హుండీ లెక్కింపు
NEWS Apr 15,2026 05:57 pm
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో 36 రోజులుగా భక్తులు సమర్పించిన హుండీ కానుకలను ఈవో దామోదర్ ఆధ్వర్యంలో లెక్కించారు. లెక్కింపులో మొత్తం రూ.1,56,91,971 నగదు ఆదాయం వచ్చినట్లు ప్రకటించారు. విదేశీ కరెన్సీలలో 34 US డాలర్లు, 1 కెనడా డాలర్, 196 మలేషియా రింగిట్లు, 100 UAE దిర్హమ్లు, 27 సింగపూర్ డాలర్లు, 80 ఇంగ్లాండ్ కరెన్సీ, 50 సౌదీ అరేబియా, 50 ఆస్ట్రేలియా డాలర్లు సమకూరినట్లు అధికారులు తెలిపారు.