భారీ పేలుడులో 5గురి మృతి!
NEWS Apr 15,2026 05:04 pm
కదిరి: సత్యసాయి జిల్లా కుమ్మరవాండ్లపల్లిలో ఓ ఇంట్లో నిల్వ ఉంచిన డిటోనేటర్లు, గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందగా.. 21 మంది గాయపడ్డారు. 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఓ కూలీ ఇంట్లో నిల్వ ఉంచిన నాలుగు డిటోనేటర్లు పేలి గ్యాస్ సిలిండర్లకు మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది.