వేడిగాలులపై అప్రమత్తంగా ఉండాలి:
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
NEWS Apr 15,2026 03:13 pm
నిర్మల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. సాధారణ స్థాయికి మించి 1.5°C నుంచి 3.5°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. వచ్చే వారం రోజుల పాటు జిల్లాలో హీట్వేవ్ ప్రభావం అధికంగా ఉండే అవకాశమున్నందున అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తగినంత నీరు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.