బూత్ స్థాయి కార్యకర్తల మీటింగ్
NEWS Apr 15,2026 03:11 pm
నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు ముధోల్ నియోజకవర్గంలోని లోకేశ్వరం మండలంలో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా P.S. నం.175 నుంచి 212 వరకు మొత్తం 38 మంది ఏజెంట్ల పేర్లను మండల నాయకుల సమన్వయంతో ఖరారు చేశారు. సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి జునైద్ మెమన్, జిల్లా కార్యదర్శి ఎం.డి. జిషాన్ అలీతో పాటు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసీలు, వార్డ్ సభ్యులు హాజరై మార్గనిర్దేశం చేశారు.