బీసీ ఆత్మగౌరవ భవనాలు అప్పగించాలి
NEWS Apr 14,2026 09:13 pm
బీసీల ఆత్మగౌరవ భవనాల వినియోగంపై కురుమ కుల పెద్దలు, నాయకులు ఓబీసీ విభాగం కన్వీనర్ కేతూరి వెంకటేష్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో నిర్మించిన 36 బీసీ ఆత్మగౌరవ భవనాలు సిద్ధంగా ఉన్నప్పటికీ ఇంకా సంఘాలకు అప్పగించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అవుతోందని పేర్కొన్నారు. దేవునూరి లక్ష్మణ్, గురునాథ్ కురుమ, కొంగల పాండు పాల్గొని భవనాలను వెంటనే బీసీ సంఘాలకు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.