క్వాంటం రంగంలో ఏపీ కొత్త అధ్యాయం!
NEWS Apr 14,2026 04:00 pm
దేశంలోనే తొలిసారిగా క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేసిన రాష్ట్రంగా ఏపీ ఘనత సాధించింది. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు ఈ సదుపాయాలను ప్రారంభించారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన '1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీ'తో పాటు, గన్నవరంలోని మేధా టవర్స్లో ఉన్న '1క్యూ క్వాంటం ఫెసిలిటీ'ని సీఎం ప్రారంభించారు. ఈ 2 కేంద్రాలు క్వాంటం కంప్యూటింగ్ ఉపకరణాలను పరీక్షించే టెస్ట్ బెడ్స్గా పనిచేస్తాయి. మైనస్ 273 డిగ్రీల సెల్సియస్ అత్యంత శీతల ఉష్ణోగ్రత వద్ద పనిచేసేలా వీటిని రూపొందించారు.