ఆల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభ
NEWS Apr 13,2026 09:35 pm
ఇంటర్ ఫలితాల్లో నిర్మల్ ఆల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చారు. ఇంటర్ తొలి సంవత్సరం ఫలితాల్లో బైపీసీ విభాగంలో 440 మార్కులకు 4గురు విద్యార్థులు 439 మార్కులు సాధించారు. ఎంపీసీలో 470 మార్కులకు 469 మార్కులు సాధించి మరో విద్యార్థి ప్రతిభను ప్రదర్శించారు. 2వ సంవత్సరం ఫలితాల్లో ఒక విద్యార్థి 995/1000 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో తొలి స్థానంలో నిలిచారు. విద్యార్థులను ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి అభినందించారు.