కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం: మేయర్
NEWS Apr 13,2026 09:28 pm
పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ హమాలీ కాలనీకి చెందిన పబ్లిక్ టాయిలెట్స్లో పనిచేస్తున్న కార్మికులు మేయర్ మూడ్ గణేష్ను సన్మానించారు. తమ సమస్యలను మేయర్ దృష్టికి తీసుకువెళ్లారు. గతేడాది నుంచి తాము పబ్లిక్ టాయిలెట్స్లో విధులు నిర్వహిస్తున్నప్పటికీ జీతాలు అందలేదని వాపోయారు. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని కోరారు. సంబంధిత అధికారులతో చర్చించి, పెండింగ్ జీతాల సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మేయర్ హామీ ఇచ్చారు.