ఆశా భోంస్లేకు చెన్నమనేని నివాళి
NEWS Apr 12,2026 05:51 pm
ప్రముఖ గాయని ఆశా భోంస్లే మృతి పట్ల మహా రాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్గా పని చేసిన సమయంలో ఆమెతో తనకు ఏర్పడిన సాన్నిహిత్యాన్ని ఆయన స్మరించుకున్నారు. యష్ చోప్రా అవార్డుల వేడుకలతో పాటు పలు వేదికలను ఆమెతో కలిసి పంచుకున్నానని తెలిపారు. ఆమె పాటలు మధుర జ్ఞాపకాలు, కాలాతీతమైన మాధుర్యంతో కూడిన ఆమె స్వరం తరతరాల శ్రోతలను అలరించిందని అన్నారు.