ఒకేషనల్ కోర్సులో హరిణి ప్రతిభ!
NEWS Apr 12,2026 08:11 pm
మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన ఆకుతోట నర్సయ్య-లావణ్యల కూతురు హరిణి ఇంటర్ 2వ సంవత్సరం ఫలితాల్లో సత్తా చాటింది. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఇంటర్ ఒకేషనల్ గ్రూపు ఎం.పి.హెచ్.డబ్ల్యులో 948 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హరిణిని అభినందించారు.