భారతీయ సంగీత దిగ్గజ గాయని ఆశా భోంస్లే (92) కన్నుమూశారు. నిన్న తీవ్ర అస్వస్థతతో ముంబై బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేరిన ఆమె, చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 12 వేలకు పైగా పాటలతో గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్నారు. సోమవారం ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.