రికార్డు స్థాయిలో భక్తుల దర్శనాలు!
NEWS Apr 12,2026 10:20 am
తిరుమల శ్రీవారి దర్శనాలకు 2025-26లో రికార్డు స్థాయిలో భక్తుల రద్దీ నమోదైంది. రోజుకు సగటున 73 వేల మంది స్వామివారిని దర్శించుకోగా, గతంతో పోలిస్తే 4.57% పెరిగింది. కొన్ని సార్లు 95 వేల వరకు చేరింది. హుండీ ఆదాయం 1420 కోట్లను దాటింది. వరుసగా 6 నెలలు నెలకు రూ.120 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. వసతి గదుల ఆదాయం రూ.141 కోట్లకు పెరిగింది. లడ్డూ ద్వారా 13.95 కోట్లు, రోజుకు 2.85 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించారు.