భారతీయుల ఇళ్లంతా బంగారమే!
NEWS Apr 10,2026 11:50 pm
భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం నిల్వలు ప్రపంచంలోని అగ్ర 10 కేంద్ర బ్యాంకుల మొత్తం బంగారం కంటే ఎక్కువగా ఉన్నాయని అసోచామ్ వెల్లడించింది. ఇళ్లలోని పసిడి విలువ సుమారు 5 ట్రిలియన్ డాలర్లకు చేరిందని అంచనా వేసింది. ప్రతి ఏడాది కనీసం 2 శాతం బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి మళ్లిస్తే దేశ వృద్ధికి పెద్ద ఊతం లభిస్తుందని తెలిపింది. 2047 నాటికి జీడీపీకి అదనంగా భారీ పెరుగుదల సాధ్యమని పేర్కొంది. గోల్డ్ మానిటైజేషన్ పథకాలను వినియోగించాలని సూచించింది.