నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం టింబుర్ని గ్రామ శివారులో మొక్కజొన్న పంట చేలో విద్యుత్ వైర్లు రాపిడి కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 8 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. రైతులు శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మరో రైతుకు చెందిన పంట బూడిద కావడంతో దాదాపు రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు సమాచారం. కోతకు సిద్ధంగా ఉన్న పంట నష్టపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు తక్షణ పరిహారం అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.