42 ఏళ్ల తర్వాత సొంతూరికి దేవ్ జీ
NEWS Apr 08,2026 08:33 pm
కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, ఒకప్పుడు ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న మాజీ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి, 42 ఏళ్ల తర్వాత స్వగ్రామానికి చేరుకున్నారు. 1983లో ఉద్యమంలో చేరిన ఆయన ఇటీవల సహచర నేతలతో కలిసి లొంగిపోయారు. స్వగ్రామానికి వచ్చిన దేవ్ జీకి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఘనంగా స్వాగతం పలికారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ గ్రామస్థులతో ఆత్మీయంగా మాట్లాడారు.