ఉపాధి హామీ పనుల పరిశీలిన
NEWS Apr 08,2026 09:57 pm
అనంతగిరి మండలం బొర్రా పంచాయతీ గేటువలస గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఫీల్డ్ అసిస్టెంట్ గోపి పరిశీలించారు. ఈ సందర్భంగా వేతనదారులతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంఎంఎస్ ఫేస్ అటెండెన్స్ను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. ఉదయం, సాయంత్రం ఫోటోలు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. కొలత విధానం ప్రకారం రోజుకు రూ.307 తగ్గకుండా పని పూర్తి చేసి వేతనం పొందాలని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధి మేట్లు మొస్య, సుబ్బారావు పాల్గొన్నారు.