KTPS అధికారులతో కార్పొరేటర్ భాగ్యలక్ష్మి భేటీ
NEWS Apr 08,2026 01:15 pm
పాల్వంచలో 4వ డివిజన్ అభివృద్ధి అంశాలపై కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి KTPS–VII స్టేజ్ CE సూర్యనారాయణ, జెఎస్ కనకదుర్గలను మర్యాదపూర్వకంగా కలిసి చర్చించారు. అనంతరం వారిని పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్దార్ సురేష్, రఘుపతి రాజు, ఏసోబు, జానకి ప్రసాద్, కన్నా, రమేష్, చెరుకు డిల్లు, సత్య రామ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.