గుండెపోటుతో చిన్నారి మృతి
NEWS Apr 08,2026 10:05 am
జగిత్యాల: పొరండ్ల గ్రామంలో విషాద ఘటన. తోపారపు చంద్రశేఖర్-నవిత దంపతుల కొడుకు, 3వ తరగతి విద్యార్థి నిశాంత్ (9) గ్రామంలోని శివాలయంలో జరిగిన అన్నదాన కార్యక్రమానికి కుటుంబంతో కలిసి వెళ్లాడు. అక్కడ తోటి పిల్లలతో ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. జగిత్యాల ఆస్పత్రికి తరలించగా వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.