రోహిత్ శర్మ రికార్డు తిరగరాసిన కోహ్లీ
NEWS Apr 05,2026 10:23 pm
ఐపీఎల్ 2026లో భాగంగా సీఎస్కేపై జరిగిన మ్యాచ్లో కోహ్లీ టీ20 క్రికెట్లో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్లో 28 పరుగులు చేయడంతో సీఎస్కేపై అతని మొత్తం పరుగులు 1,188కి చేరాయి. దీంతో రోహిత్ శర్మ పేరిట ఉన్న 1,161 పరుగుల రికార్డు చెరిపేశాడు. ఇదే మ్యాచ్లో ఆర్సీబీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 250 పరుగులు చేసి సీజన్లో అత్యధిక స్కోరు నమోదు చేసింది.