మున్నూరు కాపు సంఘం కార్యవర్గం ఎన్నిక
NEWS Apr 05,2026 10:03 pm
మున్నూరు కాపు దుబ్బవాడ సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన సంఘం అధ్యక్షుడు తోట ప్రసాద్, కార్యదర్శి ఆగ సురేష్ తెలిపారు. ఎన్నికల్లో అధ్యక్షుడిగా తోట ప్రసాద్, కార్యదర్శిగా ఆగ సురేష్, ఉపాధ్యక్షుడిగా నాగుల జైపాల్, క్యాషియర్గా ఉసికేల లక్ష్మణ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా తోట శివ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని సంఘ సభ్యులు సన్మానించారు. దొనికేల నవీన్, దోమకొండ రమేష్, జంగిటి గంగాధర్, అరిగేలా భూమయ్య, శివన్నోళ్ల రాజు, గోల్కొండ నాగరాజు, శ్రీనివాస్, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.