శివాజీ, గంగామాత విగ్రహాల ఆవిష్కరణ
NEWS Apr 02,2026 02:57 pm
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన కూడలిలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మాజీ డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరిగింది. అనంతరం గ్రామ శివారులోని పుష్కర ఘాట్ వద్ద గంగామాత విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.