అన్నదాశ్రమానికి కలధర స్కూల్ 50వేల విరాళం
NEWS Apr 01,2026 08:42 pm
గోదావరిఖనిలోని అన్నదాశ్రమానికి కలధర హైస్కూల్ తరఫున రూ.50,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం భూమరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే వృద్ధులు, అనాధలను ఆదుకునే భావన పెంపొందించుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో ఎదిగితే మంచి పౌరులుగా మారుతారని అన్నారు. విద్యార్థులచే సేకరించిన విరాళాన్ని ఆశ్రమానికి అందజేయడం జరిగిందన్నారు. అనంతరం విద్యార్థులకు అన్నదాశ్రమం ప్రతినిధులు సర్టిఫికెట్లు, మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ కమలాకర్, డైరెక్టర్ గడ్డం దివాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.