'అమరావతి అజేయం.. అజరామరం'
NEWS Apr 01,2026 11:24 am
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలపడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. గత పాలనలో ఎదురైన చీకట్లు తొలగిపోయి, అమరావతి భవిష్యత్తుపై ఉన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడిందని , సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, బిల్లుకు మద్దతు పలికిన అన్ని పార్టీలకూ ఏపీ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు చంద్రబాబు.