అమరావతి బిల్లుకు లోక్సభ ఆమోదం
NEWS Apr 01,2026 04:09 pm
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఏపీ పునర్విభజన చట్ట సవరణ పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. 2 గంటల పాటు చర్చ జరిగింది. TDP, BJP, జనసేన, కాంగ్రెస్, YCP, సమాజ్వాదీ సహా పలు పార్టీల ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. అనంతరం బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ స్థానంలో ఉన్న తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రకటించారు. ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది.