ఆకస్మిక తనిఖీకి వస్తున్నా: చంద్రబాబు
NEWS Mar 30,2026 04:15 pm
ఏప్రిల్ 1 నుంచి ఆకస్మిక తనిఖీలు ఉంటాయని అధికారులకు సీఎం చంద్రబాబు హెచ్చరించారు. పని చేయని అధికారులను ప్రజల ముందే నిలదీస్తామని చెప్పారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి ప్రజలు మెచ్చే పాలన చేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు బాగా పని చేయాలని, లేనిపక్షంలో మొహమాటం లేకుండా నిలదీస్తానని వార్నింగ్ ఇచ్చారు. వర్క్ చేయని అధికారులతో పని చేయిస్తానని, అది తన బాధ్యత అని సీఎం చెప్పారు.