కేంద్రం నుంచి ‘కిరోసిన్’ పంపిణీ
NEWS Mar 30,2026 10:23 am
పశ్చిమాసియా ఘటనల కారణాలతో దేశంలో గ్యాస్, ఇంధనాల కొరత నానాటికీ తీవ్రమవుతోంది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ సమస్య తగ్గించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. రేషన్ షాపుల ద్వారా అన్ని రాష్ట్రాలకు సుపీరియర్ కిరోసిన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. వంట, దీపాలు వెలిగించడం కోసమే షరతులకు లోబడి ఈ పంపిణీని చేపట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో పాటు లైసెన్స్ పొందిన సర్వీస్ స్టేషన్లలో 2,500 లీటర్ల వరకు కిరోసిన్ నిల్వ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది.