శ్రీవారి ఆదాయం రూ. 3.01 కోట్లు
NEWS Sep 25,2025 10:07 am
తిరుమల భక్తులతో కిట కిట లాడుతోంది. శ్రీవారిని 58 వేల 628 మంది భక్తులు దర్శించుకున్నారు. 21 వేల 551 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.01 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. భక్తులు 7 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 10 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.