శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.06 కోట్లు
NEWS Sep 23,2025 09:12 am
తిరుమల శ్రీవారిని 60 వేల 681 మంది దర్శించుకున్నారు. 19 వేల 510 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.06 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ప్రస్తుతం భక్తులు 5 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 8 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.