తిరుమల భక్తులతో కిట కిట
NEWS Sep 21,2025 08:01 am
తిరుమల భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీవారిని 82 వేల 42 మంది భక్తులు దర్శించుకున్నారు. 23 వేల 393 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం ర. 4.59 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ప్రస్తుతం భక్తులు 10 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని , ఎలాంటి టోకెన్లు వారికి కనీసం 8 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.