తిరుమలకు పోటెత్తిన భక్తులు
NEWS Sep 20,2025 07:56 am
తిరుమలకు భక్త బాంధవులు పోటెత్తారు. శ్రీవారిని 71 వేల 249 మంది భక్తులు దర్శించుకున్నారు. 22 వేల 901 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.04 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. స్వామి వారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని వారికి 18 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.