తిరుమల క్షేత్రం భక్త సందోహం
NEWS Sep 19,2025 08:50 am
తిరుమల భక్త బాంధవులతో కొనసాగుతోంది. శ్రీవారిని 68 వేల 95 మంది భక్తులు దర్శించుకున్నారు. 23 వేల 932 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.70 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ప్రస్తుతం భక్తుల క్యూ లైన్ శిలా తోరణం వరకు ఉందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 15 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.