సేంద్రియ వ్యవసాయం చేయాలి
NEWS Sep 19,2025 11:22 am
గోవు పర్యా వరణ పరిరక్షణలో శాస్త్రీయ విజ్ఞానం అనే వ్యాసరచన పోటీని కోరుట్ల జడ్పీ బాయ్స్ హైస్కూల్ లో నిర్వహించినట్లు ప్రిన్సిపల్ జ్యోత్స్న తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించడం విద్యార్థి దశ నుంచే అలవర్చు కోవాలని, వ్యవసాయంలో కృత్రిమ ఎరువుల వాడకాన్ని తగ్గించు కోవాలని, దేశవాళీ ఆవులతో పంచగవ్యాలు ఉపయోగించి సేంద్రియ వ్యవసాయం చేయాలని తద్వారా ఆరోగ్యకర జీవితం అనుభవించడానికి అవకాశం ఉంటుందని అన్నారు.