శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.86 కోట్లు
NEWS Sep 18,2025 08:10 am
తిరుమల శ్రీవారిని 68 వేల 213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29 వేల 410 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.86 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. భక్తుల క్యూ లైన్ శిలా తోరణం వరకు కొనసాగుతోందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 24 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.