కొత్త పార్టీ ప్రకటించిన తీన్మార్ మల్లన్న
NEWS Sep 17,2025 04:39 pm
తీన్మార్ మల్లన్న 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ'ని ప్రారంభించారు. తాజ్ కృష్ణా హోటల్లో పార్టీ జెండాను పరిచయం చేశారు. జెండా పైభాగంలో ఎరుపు రంగు, కింది భాగంలో ఆకుపచ్చ రంగు ఉన్నాయి. జెండా మధ్యలో కార్మిక చక్రాన్ని, దాని నుంచి పైకి లేస్తున్నట్లుగా పిడికిలిని చిహ్నంగా పొందుపరిచారు. 2 ఆలీవ్ ఆకులను చేర్చారు. జెండాపై 'ఆత్మగౌరవం, అధికారం, వాటా' అనే నినాదాన్ని ముద్రించారు. బీసీల ఆత్మగౌరవమే ప్రధాన ఎజెండాగా తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపిస్తున్నట్లు తీన్మార్ మల్లన్న తెలిపారు.