శ్రీవారి హుండీ ఆదాయం ₹3.87 కోట్లు
NEWS Sep 17,2025 02:19 am
భక్తబాంధవులతో తిరుమల కిటకిట లాడుతోంది. శ్రీవారిని 63 వేల 607 మంది భక్తులు దర్శించుకున్నారు. 23 వేల 856 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.87 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. భక్తుల క్యూ లైన్ క్రిష్ణ తేజ గెస్ట్ హౌస్ దాకా ఉందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 24 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.