శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.13 కోట్లు
NEWS Sep 16,2025 07:41 am
తిరుమల భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీవారిని 65 వేల 66 మంది భక్తులు దర్శించుకున్నారు. 24 వేల 620 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.13 కోట్లు వచ్చినట్లు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ప్రస్తుతం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని వారికి కనీసం 15 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.