మెట్ పల్లిలో కత్తి పోట్ల కలకలం
NEWS Sep 15,2025 08:10 pm
మెట్ పల్లి పట్టణంలో కత్తి పోట్లు జరిగిన ఘటన కలకలం రేపింది. బస్ డిపో వద్ద ఆదివారం రాత్రి పట్టణానికి చెందిన గణేష్ అనే యువకుడిపై జగిత్యాల పట్టణానికి చెందిన రాజేష్ అనే యువకుడు మధ్య ఓ ద్విచక్ర వాహనానికి సంబంధించి డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ తరుణంలో రాజేష్ అనే యువకుడు గణేష్ ను కత్తితో పొడిచాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి గణేష్ ను మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి మెరుగైన చికిత్స కొరకు నిజామాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రికి చేర్చారు. ప్రస్తుతం గణేష్ చికిత్స పొందుతున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.