తిరుమలకు పోటెత్తిన భక్తులు
NEWS Sep 14,2025 07:51 am
పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామిని 82 వేల 149 మంది భక్తులు దర్శించుకున్నారు. 36 వేల 578 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.85 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. క్రిష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు భక్తుల క్యూ లైన్ కొనసాగుతోందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 24 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.