23 నుంచి ఇందిరమ్మ చీరలు పంపిణీ
NEWS Sep 13,2025 09:39 am
దసరా కానుకగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు. ఇప్పటికే 50 లక్షల చీరలు తయారీ చేశారు. మరో 10 లక్షల చీరలు ప్రాసెసింగ్ లో ఉన్నాయి. ఒక్కో చీరకు కనీసం రూ. 800కు పైగా ఖర్చు అయినట్లు సమాచారం.