శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.18 కోట్లు
NEWS Sep 13,2025 07:54 am
తిరుమల భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీవారిని 69 వేల 842 మంది భక్తులు దర్శించుకున్నారు. 28 వేల 234 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.18 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ప్రస్తుతం కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్ ఉందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 15 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.