శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.81 కోట్లు
NEWS Sep 12,2025 07:37 am
తిరుమల పుణ్యక్షేత్రం భక్తులతో కిట కిట లాడుతోంది. శ్రీవారిని 66 వేల 312 మంది భక్తులు దర్శించుకున్నారు. 27 వేల728 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.81 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ప్రస్తుతం భక్తుల క్యూ లైన్ శిలా తోరణం వరకు ఉందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 24 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.