తిరుమలకు పోటెత్తిన భక్తజనం
NEWS Sep 11,2025 09:56 am
తిరుమల పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిట లాడింది. శ్రీవారిని 70 వేల 86 మంది భక్తులు దర్శించుకున్నారు. 28 వేల 239 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.56 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ప్రస్తుతం భక్తులు 22 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 18 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.